గత 24 గంటల్లో భారత్ లో 2411 కరోనా కేసులు, 71 మరణాలు. దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదైంది ఇవాళే. భారత్ లో మొత్తం 37, 776కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు కరోనాతో 1223 మంది మృతి. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇప్పటి వరకూ 10018 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 26535 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 10వేలు దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లోనూ అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.