దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రబలి పోతుంది.. ప్రజలు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.  ఈ సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.  గత కొన్ని రోజుల నుంచి కాశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు.  తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో జవాన్లు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్, మేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్లు చేస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత దళాలు ఎన్‌కౌంటర్ ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోన్నట్టు తెలుస్తోంది.  హాంద్వారాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: