కరోనా మహమ్మారిపై ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్న జర్నలిస్టులు సహా  వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.పది లక్షల బీమాను వర్తింపచేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా మీడియా సేవ‌ల‌ను కొనియాడారు. ఇదే స‌మ‌యంలో ప‌లు సూచ‌న‌లు కూడా చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా నిలిచే మీడియా స్వతంత్రంగా నిర్భయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు.

 

భావ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కరోనాపై ముందుండి పోరాడే వారితో పాటు జర్నలిస్టులకూ బీమా సౌకర్యం వర్తింప చేస్తామని ఆమె వెల్లడించారు. మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌ట‌న‌పై జ‌ర్న‌లిస్టులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అనేక మంది జ‌ర్న‌లిస్టులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ముంబైలో అయితే.. ఏకంగా 52మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇందులో చాలామంది ఇప్ప‌టికే కోలుకుని ఇటీవ‌లే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: