ఆ మద్య   టీటీడీలో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులపై వేటు పడిందంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఎలుగెత్తారు. వారిని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఊరట కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ఏ చిన్న సందు దొరికినా అధికార పక్షం పై విరుచుకు పడుతున్నారు. ఇక ప్రభుత్వం ఏ తప్పు చేసిన ప్రశ్నించేందుకు నేనున్నాంటున్న పవన్ కళ్యాన్ గత కొంత కాలంగా ఏపి లో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

ఈ నేథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. 1400 మంది కార్మికులను కొనసాగించాలంటూ తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని పేర్కొన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకుని మానవత్వం చాటారని కొనియాడారు.  తిరుమలలో శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా కొద్దిపాటి వేతనాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని పవన్ వెల్లడించారు. కార్మికుల కోసం ప్రభుత్వం చేసే ప్రతిపనికీ జనసేన సహకారం ఉంటుందని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: