ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యంలో వ‌ల‌స కార్మికుల కోసం ప‌ది బెడ్ల‌కు త‌గ్గ‌కుండా ప్ర‌త్యేక‌ క్వారంటైన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపీలో  ఇత‌ర రాష్ట్రాల వారు 12794 మంది ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. వ‌ల‌స కార్మికుల కోసం స్ప‌ష్ట‌మైన విధానాన్ని రూపొందించామ‌ని ఆయ‌న తెలిపారు. రెడ్‌జోన్ల‌లో స‌రుల‌కు రావాణా కోసం 500 ఆర్టీసీ బ‌స్సులు, మొబైల్ నిత్యావ‌స‌ర సరుకుల వాహ‌నాలను కూడా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఇంటికి ఒక‌రికి మాత్ర‌మే పాస్ ఇస్తామ‌ని తెలిపారు.

 

వ‌ల‌స కార్మికుల కోసం 9ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. టెలీమెడిసిన్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించార‌ని మంత్రి పేర్కొన్నారు. టెలీమెడిసిన్ ద్వారా మందుల స‌ర‌ఫరా చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మందుల పంపిణీలో శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: