ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య క‌రోనా వార్ కొన‌సాగుతూనే ఉంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా పెద్ద యుద్ధ‌మే చేస్తున్నారు. తాజాగా.. వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి  ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. సెటైర్ల‌మీద‌ సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో *సైకిల్ బెల్స్‌, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగలను చేరదీసి పదవులిచ్చినందుకు చంద్రబాబుకు ప్రజల చేతిలో పెద్ద శాస్తే జరిగింది. రౌడీ షీట్లు మూసేయించినా బుద్ధులు మారవు కదా. కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుంది! ఇంకో మూడ్నాలుగు నెలలే వారి ఆగడాలు. తర్వాత అడ్రసు లేకుండా పోతారు* అని విజ‌య‌సాయిరెడ్డి విరుచుకుప‌డ్డారు.

 

ఇక్క‌డితోనే ఆగ‌లేదు.. మ‌రో ట్వీట్ చేశారు.. * ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వాళ్లు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకిది చక్కని అవకాశం. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. మీ ఇష్టం* అని విజ‌య‌సాయిరెడ్డి ఏకిపారేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: