హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 169 మందిని క్వారంటైన్లో ఉంచారు. దీంతో ఈ ఏరియా పరిధిలోని ఎనిమిది ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు నిర్ణయించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్-సాహెబ్ నగర్ రోడ్డు, ఏ, బీ టైప్ కాలనీలు, ఎస్కేడీ నగర్, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్ కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు.
ఈ జోన్లలో రేపటి నుంచి ఏడు రోజులపాటు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతంలో సోమవారం నుంచి రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. రైతుబజార్, పండ్లు, ఇతర మార్కెట్లను అధికారులు పూర్తిగా మూసివేయనున్నారు.