IHG

తెలంగాణ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూ ఉంది. గతంలో మోడీ గారు మే 3 వరకు లాక్ డౌన్ పొడిగుస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా తందానా  అన్నట్లు మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కాస్త కష్టమైనా పాటిద్దాం అనుకున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మరో ప్రకటన గొంతులో వెలగ పండులా తయారైంది. కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు పొడిగిస్తుందని చెప్పడంతో ఓ పేద తండ్రి తన కూతురిని కర్కశంగా చంపేశాడు. తన చిన్నారి కూతురిని గొంతుకోసి చంపేశాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

IHG

 

పూర్తి వివరాలలోకి వెళితే సంగారెడ్డి జిల్లాలోని పుల్కాల్ మండలం లోని గొంగులూరు గ్రామానికి చెందిన రామావత్ జీవన్ అనే గ్రామస్తుడు తన ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కొడుకుతో ఉంటున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆ వార్తలు విని తన కూతురు (4 ) నిద్రిస్తుండగా కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. మరి కారణం ఏమిటని అడుగగా లాక్ డౌన్ పెంచుతున్నారన్న వార్త విన్నప్పుడు ఆవేశంలో ఇలా చేశానని ఒప్పుకున్నాడు . పోలీసులు కేసు ఫైల్ చేసి విచారిస్తూ ఉన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: