కలియుగ వైకుంఠం, కోట్లాది ప్రజల ఇలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం భక్తులకు దూరమై 45 రోజులు అవుతోంది. తిరుమల చరిత్రలో శ్రీవారి దర్శనాలు ఇన్ని రోజులు నిలిపివేయడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ కారణంగా మార్చి నెల మూడో వారం నుంచి దర్శనాలను నిలిపివేశారు. కేంద్ర ప్రకటనకు అనుగుణంగా తిరుమలలోనూ లాక్ డౌన్ ను టీటీడీ పొడిగిస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో మరో రెండు వారాల పాటు దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక మే 17 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, పరిమిత సం ఖ్యలో అయినా భక్తులకు దర్శనాలను కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. అందుకు అవలంభించాల్సిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది.
కలియుగ వైకుంఠం, కోట్లాది ప్రజల ఇలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం భక్తులకు దూరమై 45 రోజులు అవుతోంది. తిరుమల చరిత్రలో శ్రీవారి దర్శనాలు ఇన్ని రోజులు నిలిపివేయడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ కారణంగా మార్చి నెల మూడో వారం నుంచి దర్శనాలను నిలిపివేశారు. కేంద్ర ప్రకటనకు అనుగుణంగా తిరుమలలోనూ లాక్ డౌన్ ను టీటీడీ పొడిగిస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో మరో రెండు వారాల పాటు దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక మే 17 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, పరిమిత సం ఖ్యలో అయినా భక్తులకు దర్శనాలను కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. అందుకు అవలంభించాల్సిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది.