లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రణ్వీర్ ఎక్కువ సేపు సమయాన్ని నిద్రకి కేటాయిస్తుండగా, దీపికా తన భర్త కోసం వెరైటీ వంటకాలు నేర్చుకుంటుందట. అందరు సెలబ్రిటీల్లాగే.. దీపికా కూడా తాను చేసిన వంటలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీపికా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామిడి కాయ ముక్కలను కోసి ఉప్పుకారం చల్లి ఉన్న ఫోటోను షేర్ చేసింది దీపికా. పుల్లపుల్లగా ఉండే మామిడి ముక్కలను ఎక్కువగా గర్భిణీలు చాలా ఇష్టంగా తింటారు.
ఇంకేముంది నెటిజన్లు కూడా వెంటనే ప్రశ్నలు వేశారు. దీపికా తల్లి కాబోతున్నావా ? శుభవార్త ఎప్పుడు చెబుతున్నావ్ ఏంటి అంటూ ఎంతో ఉత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఈ భామ ఎప్పుడు సమాధానం చెబుతుందో మరి. ఇక రణ్వీర్-దీపికల వివాహం 2018 నవంబర్లో ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ దంపతులు తమకు దొరికిన హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ, వారి వారి ప్రాజెక్టులని పూర్తి చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు రణ్వీర్, దీపిక కలిసి గోలియోం కీ రాస్లీలా, రామ్-లీలా, 'ఫైండింగ్ ఫానీ', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' లలో నటించారు.