టాలీవుడ్ లో షో సినిమాతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న నటి , ప్రొడ్యూసర్ మంజుల ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు కి స్వయానా అక్క. షో సినిమా ద్వారా ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. తెలుగు గులో మహేష్ నటించిన పోకిరి, నాని సినిమాలకు ప్రొడ్యూసర్ గా మంచి మార్కులు కొట్టేసింది. అంతే కాకుండా మనసుకి నచ్చింది సినిమాతో ఈమె డైరెక్టర్ గా కూడా తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. యాక్టర్ సంజయ్ స్వరూప్ తో కలసి ఆరెంజ్ సినిమాలో కనిపించింది.
లాక్ డౌన్సంధర్బంగా సినీతారలు సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ గా మంజుల కూడా తన ట్విట్టర్ లో అభిమానులను ఖుషి చేస్తూ ట్వీట్ చేస్తూ చిరునవ్వు యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది ...అదేంటంటే " మీరు నవ్వినప్పుడు, మీరు మిమ్మల్ని ఆరాధించడం మరియు మీ అంతర్గత భావోద్వేగాలను ఆరాధించడం ప్రారంభిస్తారు. మీరు మీతో ఉండటాన్ని ఎంతో ఇష్టపడినప్పుడు, మీరు స్వీయ ప్రేమ మరియు సానుకూల భావోద్వేగాలను పెంచుకుంటారు. గుర్తుంచుకోండి, ఇదంతా చిరునవ్వుతో మొదలవుతుంది " ..అని ట్వీట్ లో పేర్కొన్నారు మంజులా...
When you smile, you begin to adore yourself and admire your inner emotions. When you cherish being with yourself, you develop self love and positive emotions.
— manjula Ghattamaneni (@ManjulaOfficial) May 4, 2020
Remember, it all starts with a Smile♥️#30daysofchallenge #drinkingwater #smiling #eatyourveggies pic.twitter.com/E0vSBRffQb