క‌రోనా నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఐఐటీ మద్రాస్‌లోని మ్యూజ్‌ వేరబుల్స్‌ సంస్థ ఓ అద్భుత‌ ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్‌ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్‌ పదార్థాన్ని అభివృద్ధి చేసింది. ఎన్‌95 మాస్కులు మొదలుకొని సర్జికల్‌ మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు.. ఆహారాన్ని పార్శిల్‌ చేసేందుకు వాడే బ్యాగుల్లాంటి వాటిపై ఈ కొత్త పదార్థపు పూతను పూస్తే ఆ ఉపరితలంపై పడ్డ వైరస్‌ వెంటనే నాశ‌న‌మ‌వుతుంది. ఈ నానో పూత ఉన్న వస్త్రా న్ని సుమారు అరవైసార్లు ఉతికినప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గదట‌. మ్యూజ్‌ వేరబుల్స్‌ అభివృద్ధి చేసిన యంత్రానికి కొన్ని నిమిషా ల వ్యవధిలోనే దాదాపు వంద మీటర్ల నిడివి గల వస్త్రంపై నానో పూ త పూయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంటుంది.

 

అంటే.. ఈ యంత్రాన్ని వెంటనే వాణిజ్యస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. అయితే.. క‌రోనాపై పోరును వేగవంతం చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడి ఇన్‌క్యూబేషన్‌ సెల్‌లో మ్యూజ్‌ వేరబుల్స్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మ్యూజ్‌ వేరబుల్స్‌ కోటింగ్‌ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని, వేర్వేరు వస్త్రాలపై వేర్వేరు నానో పదార్థపు పూతను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే వారం రోజుల్లోనే నానో పూత తో కూడిన వస్త్రాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. అలాగే.. మాస్కులు తయారు చేసే కంపెనీతో కలసి నానోపూత కలిగిన, ఐదు పొరల మాస్కును సిద్ధం చేస్తోంది ఈ కంపెనీ. ఒక్కో మాస్కు ఖరీదు దాదా పు రూ.300 వరకూ ఉండవచ్చని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: