త‌న‌పై కొన్ని వెబ్‌సైట్లు ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నాయంటూ నిన్న టాలీవుడ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఓ వీడియోను షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో ఓ వెబ్ సైట్‌రాసిన ఆర్టిక‌ల్‌ను చ‌దువుతూ.. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూనే.. ఏకిపారేశాడు. ఆ వీడియోలో చాలా ఘాటుగానే స్పందించాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. ఇదేస‌మ‌యంలో చాలా వెబ్‌సైట్లు మాత్రం ఉన్న‌ది ఉన్న‌ట్లు రాస్తున్నాయ‌ని, కానీ మూడు నాలుగు వెబ్‌సైట్లు మాత్రం త‌ప్పుడు వార్త‌లు, చిల్ల‌ర‌వార్త‌లు రాస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి తాము ఎంతో ప్ర‌య‌త్నం చేస్తున్నామంటూ ఆయ‌న చెప్పారు. త‌మ వ‌లంటీర్లు ఉద‌యం నుంచి రాత్రివ‌ర‌కు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.

 

తాజాగా.. విజ‌య్‌దేవ‌ర‌కొండ మ‌రో ట్వీట్ చేశాడు. ఇక నిశ్శ‌బ్దంగా ఉండ‌లేను.. ఓపిక ప‌ట్ట‌లేను.. అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉందాం.. అంటూ పిలుపునిచ్చాడు. కిల్ ఫేక్‌న్యూస్‌, కిల్ గాసిప్స్ వెబ్‌సైట్స్‌, స్ప్రెడ్ పాజిటివిటీ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై హీరో అల్ల‌రి న‌రేష్ కూడా స్పందించాడు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఈ త‌ప్పుడు వార్త‌ల‌పై పోరాడుదామ‌ని మ‌ద్ద‌తు ప‌లికాడు. ఇలా మ‌రికొంద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు, అభిమానులు కూడా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: