మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో  అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖ‌లోనూ కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేష‌న్‌కు చెందిన 12 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.  వీరిలో ఆరుగురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

అయితే వీరిలో 8 మందిలో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేవ‌ని, ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ‌ స‌భ్యులు స‌హా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపిన‌ట్లు పోలీస్ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.  జెజె హాస్పిట‌ల్ ప‌క్క‌నే జెజె మార్గ్ పోలీస్ స్టేష‌న్ కూడా ఉండ‌టంతో ఇంకా వైర‌స్ ఎవ‌రెవ‌రికి సోకింద‌నే విష‌యం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: