మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య కొణిదెల నిహారిక సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు టైం పాస్‌కోసం ప‌లు ఛాలెంజ్‌లు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. అంతేగాదు.. ఇంటి ప‌నుల్లోనూ ఎంతో సాయ‌ప‌డుతూ ఉంటుంద‌ట‌. తాజాగా ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 

* ప్రసిద్ధ ఆవకాయ పచ్చడిని మొదటి సంవత్సరం తయారు చేశాను. కొంత ముద్ద పప్పుతో సిద్ధంగా ఉండండి*  అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో నోరూరించింది ఈ భామ‌‌. అయితే.. ఈ ఎందుకు చెప్పిందో తెలుసా..? గ‌తంలో నిహారిక‌ ముద్ద‌ప‌ప్పు ఆవకాయ అనే వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాలో న‌టిస్తున్న నిహారిక..త‌మిళంలో  యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఓ చిత్రం చేయ‌నుంది. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంద‌రూ లైక్ చేస్తూ.. కామెంట్స్ ఇస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

First year of making the famous AVAKAI PACCHADI! (mango pickle) Get ready with some muddapappu!

A post shared by niharika Konidela (@niharikakonidela) on

మరింత సమాచారం తెలుసుకోండి: