యావ‌త్ భార‌తావ‌నిపై క‌రోనా పంజా విసురుతోంది. నిమిషం నిమ‌షానికి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ఇక మంగ‌ళ‌వారం అప్‌డేట్స్ చూస్తే మ‌న దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్తాయిలో ఏకంగా 3900 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 46 వేలు దాటి 50 వేల వైపు ప‌రుగులు పెడుతోంది. ఓ వైపు సుదీర్ఘ‌కంగా నెల రోజుల‌కు పైగా లాక్ డౌన్ కొన‌సాగుతోంది.

 

ఈ క్ర‌మంలోనే లాక్ డౌన్‌ను ఎత్తి వేయాల‌న్న డిమాండ్లు కూడా వ‌స్తున్నాయి. కేంద్రం సైతం నిబంధ‌న‌లు క్ర‌మ‌క్ర‌మంగా స‌డ‌లిస్తోంది. ఈ టైంలో క‌రోనా కేసులు విజృంభిస్తుండ‌డంతో మ‌న దేశంలో ప‌రిస్థితి అయితే అంత సేఫ్ కాద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. ఇక సోమ‌వారం న‌మోదు అయిన 3900 కేసులు రికార్డు బ‌ద్దలు కొట్టాయి. ఈ స్థాయిలో ఒకే రోజులో ఎక్కువ కేసులు న‌మోదు అవ్వ‌డం ఇదే తొలిసారి. ఇక మ‌హారాష్ట్ర ఏకంగా 12 వేల పైచిలుకు కేసుల‌తో అట్టుడుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: