మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు సగానికిపైగా పూర్తయింది.  లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్త లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి-రెజీనాల మధ్య వచ్చే స్పెషల్‌ సాంగ్‌ అదిరిపోతుందని, ఈ పాటకు చిరు స్టెప్పులు మాములుగా ఉండవని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నాడు. అయితే చరణ్‌ ఎపిసోడ్‌లో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌కు డైరెక్టర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్‌ సాంగ్‌లో చరణ్‌తో అనసూయ ఆడిపాడనుందని టాలీవుడ్‌ టాక్‌. రంగస్థలంలో చరణ్‌, అనసూయల మధ్య వచ్చే సీన్స్‌ ఎంత హైలెట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆచార్య’లో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ మామూలుగా ఉండవని అంటున్నారు. మ్యాటినీ ఎంటర్‌ టైన్‌మెంట్‌, కొనిదల ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: