కరోనా విషయంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ట్విట్టర్ వేదికగా నడుస్తున్న వార్ రోజురోజుకూ వేడిపుట్టిస్తోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో రక్తికట్టిస్తున్నారు. ఏపీలో నిన్న మద్యం షాపులు ప్రారంభం కాగా.. షాపుల ముందు వందలు, వేల సంఖ్యలో మందుబాబులు కిలీమీటర్ల కొద్దీ బారులు తీరిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పదించి, ఈ దృశ్యాలు తనను షాక్కు గురిచేశాయంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియోలను పోస్ట్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ దారుణమైన పరిస్థితులు వచ్చాయంటూ విమర్శలు గుప్పించారు.
దీనిపై తాజాగా.. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాబుగారి గత చరిత్రంతా తవ్వితీశారు. *గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ గారు వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది* అంటూ విజయసాయి సెటైర్లు వేశారు.
గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ గారు వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది!
— Vijayasai reddy v (@VSReddy_MP) May 5, 2020