ప్రముఖ బుల్లి తెర నటి, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో శ్రీముఖి యాంకర్గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణులను కించపరిచినట్టు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితోపాటు, జెమిని టీవీ యాజమాన్యంపై పోలీసులుకు కేసు నమోదు చేశారు.
యాంకర్గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పలు చిత్రాల్లో కూడా నటించారు. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు దగ్గయ్యారు. అందంతోపాటుగా తనదైన కామెడీ టైమింగ్తో అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది బిగ్బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి.. రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.