ఏపీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌మ‌వుతోంది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అధిక‌మ‌వుతోంది. గ‌త 24గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌ర్నూలులో 17, కృష్ణాలో 14, గుంటూరులో 12 కేసులు న‌మోదు అయ్యాయి. మిగ‌తా 13 పాజిటివ్ కేసుల బాధితులు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు.  విశాఖ‌లో రెండు, తూర్పుగోదావ‌రి జిల్లాలో ఒక కేసు న‌మోదు అయింది. గ‌త 24 గంట‌ల్లో క‌ర్నూలులో ఒక‌రు, కృష్ణా జిల్లాలో మ‌రొక‌రు మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,777కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణాల సంఖ్య 36కు చేరుకుంది.

 

క‌రోనా నుంచి కోలుకుని 729మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక 1012 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌ర్నూలులో మొత్తం కేసుల సంఖ్య 533, గుంటూరులో 363కు చేరుకుంది. అలాగే కృష్ణా జిల్లాలో 300, నెల్లూరులో 92, అనంత‌పురంలో 80, చిత్తూరులో 82, తూర్పుగోదావ‌రిలో 46, క‌డ‌ప‌లో 90, ప్ర‌కాశంలో 61, శ్రీ‌కాకుళంలో 5, విశాఖ‌ప‌ట్నంలో 39,  ప‌శ్చిమ‌గోదావ‌రిలో 59 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు 27మంది బాధితులు ఉన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: