జమ్మూకశ్మీర్లోని హింద్వారా ఘటనకు ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. మన భద్రతాదళాలు నెత్తుటి బాకీ తీర్చుకున్నాయి. హిజుబుల్ ముజాహిదిన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ హతమయ్యాడు. అవంతపుర సెక్టార్లో బుధవారం ఉదయం నుంచి జరిగిన ఆపరేషన్లో ఈ టాప్ కమాండర్ను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అంతేగాకుండా.. భారత ఆర్మీ చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనతో జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. మూడు రోజుల కిందట హింద్వారాలో ఉగ్రమూకలు చేసిన దాడిలో ఐదురుగు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మేజర్ కూడా ఉన్నారు. ఈ ఘనతో భారత్ శోకసంద్రంలో మునిగిపోయింది. అదేరోజు భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. తాజాగా.. హిజుబుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి.