టీడీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి చింతమనేని కేశవరావు (86)  బుధ‌వారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతోనూ, వ‌యోః భారంతోనూ బాధ‌ప‌డుతోన్న ఆయ‌న మృతిచెందారు. ఇక కేశ‌వ‌రావు గ‌తంలో దుగ్గిరాల స‌ర్పంచ్‌గా ప‌నిచేశారు.

 

ఆయ‌న రాజ‌కీయ వార‌స‌త్వంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన చింత‌మ‌నేని ముందుగా పెద‌వేగి ఎంపీపీగా ప‌నిచేసి ఆ త‌ర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చింత‌మ‌నేని టీడీపీ ప్ర‌భుత్వంలో విప్‌గా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. కేశవరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ తదితరులు సంతాపం తెలిపారు. చింతమనేనిని ఫోన్ లో పరామర్శించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబులు తమ సానుభూతి తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: