క్వారంటైన్ అంటే భయమో.. లేక.. కరోనా అంటే లెక్కలేదమోగానీ.. ఏకంగా క్వారంటైన్ కేంద్రం నుంచి ముగ్గురు కరోనా బాధితులు పారిపోయారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన ముగ్గురు వ్యక్తులు క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయారు. గత 24 గంటల్లో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రిలో నుంచి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు నమోదు చేశామని.. ఆ ముగ్గురిని పట్టుకుని క్వారంటైన్ సెంటర్ లో చేరుస్తామని ఒడిశా పబ్లిక్ రిలేషన్ విభాగం అధికారి తెలిపారు. ఒడిశాలో జోన్ల వారీగా లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.
అయితే.. ఈఘటనతో అధికారులు ఉలిక్కిపడుతున్నారు. స్థానికులు తీవ్ర భయాందోళనకుగురవుతున్నారు. వారు ఎక్కడికి పారిపోయి ఉంటారు..? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ ముగ్గరు కరోనా బాధితులు జన సమూహంలో కలిసి కలకమే రేగుతుందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని అతిత్వరగా పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.