విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి కెమికల్ గ్యాస్ లీకై మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. లీకైన గ్యాస్ ను పీల్చడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ పీల్చిన వారిలో ఇద్దరు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 
 
అధికారులు పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని సమాచారం. వారిని ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సహాయంలో విశాఖలోని కేజీహెచ్ కు తరలిస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గ్యాస్ లీకేజ్ అయినట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: