విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు స్టైరేడ్ అనే కెమికల్ గ్యాస్ లీకైంది. మూడు కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించగా గ్యాస్ పీల్చిన ఇద్దరు మృతి చెందారు. కొందరు అపస్మారక స్థితిలో రోడ్లపైనే పడిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 
 
గ్యాస్ లీకేజ్ కావడంతో విశాఖ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కెమికల్ గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కంపెనీకి సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామంపై కెమికల్ గ్యాస్ ప్రభావం భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: