విశాఖలో గ్యాస్‌ లీక్‌ఘటనపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఫోన్ చేశారు. ప్ర‌మాద ప‌రిస్థితి పూర్తి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటన వివరాలను సీఎం మోదీకి వివ‌రించారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణం తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని జ‌గ‌న్ మోదీకి వెల్లడించారు. ఇక మోదీ సైతం ఈ ప్ర‌మాదంపై అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసే ప‌రిస్థితి ఉందంటే ప్ర‌మాదం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇక ఏపీ గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీఎంకు ఫోన్‌చేశారు. ప్రమాదకారణాలు సహా, సహాయక చర్యలను సీఎం ఆయనకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: