కర్ణాటక రాష్ట్రంలో రోడ్డుపై వెళ్తున్న పామును తాగినమ‌త్తులో పట్టుకుని నోటితో కొరికి చంపి మెడలో వేసుకున్న మందుబాబు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. మత్తు దిగిన తరువాత మ‌నోడికి డైరెక్టుగా కటకటాలు కనిపించాయి. తాగిన‌మైకంలో పాము చంపి మెడ‌లో వేసుకుని మందుబాటిల్‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన ఆ వ్య‌క్తి బీడియో వైర‌ల్ అయింది. అట‌వీ అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆ నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

బుధవారం ముళబాగిలు తాలూకా ముష్టూరు గ్రామానికి చెందిన కుమార్‌కు గ్రామంలో ఫుల్లుగా తాగి బైక్‌ మీద వెళ్తుండగా ఓ పాము కనిపించింది. వెంట‌నే అక్క‌డే బైక్ ఆపేసి, దానిని పట్టుకుని నోటితో ఇష్టానుసారంగా కొరికి, మెడలో వేసుకుని మద్యం తాగుతూ నానా హంగామా చేయడం తెలిసిందే. ఈ ఘ‌టన సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, అటవీశాఖ అధికారులు కుమార్‌ను అరెస్టు చేశారు. అయితే.. మ‌త్తు దిగిన త‌ర్వాత ఈ తాగుబోతుకు తానేం చేశాడ‌న్న‌ది గుర్తుకురాలేదు. ఇంత‌లోనే అట‌వీశాఖ మ‌నోడికి ఊహించ‌ని షాక్ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: