విశాఖ ప్రమాదంలో లీక్ అయిన స్టెరీన్ విషవాయువు మానవ నాడీ, శరీర వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారు. ఇది గాలిలో ఆక్సిజన్ను నైట్రోజన్ను డామినేట్ చేయడంతో ఇది మరింత ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. అందుకే ప్రజలు ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ను విషవాయువు డామినేట్ చేయడంతో ఊపిరి అందక విలవిల్లాడినట్టు తెలుస్తోంది. ఇది ఊపిరి తిత్తుల్లోకి ఎక్కువుగా వెళితే ఆ ప్రమాదం మిగిలిన అవమవాలపై కూడా పడుతుందని వైద్యులు చెపుతున్నారు. ఇక భోపాల్ గ్యాస్ లీకేజ్ తరహాలోనే కొందరు గర్భిణీలు, ఊపిరి తిత్తులపై సైతం ప్రభావం చూపుతుందని చెపుతున్నారు. ఈ వాయువు గర్భిణీలు పిల్చితే లోపల ఉన్న పిల్లలు పీల్చి వారిపై సైతం ప్రభావం చూపుతుందని అంటున్నారు.