ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు గ్యాస్ ప్రమాదం జరిగిన తర్వాత తనకు విశాఖ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. 

 

దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ చంద్రబాబుని విశాఖ వెళ్ళవచ్చు అని అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు విశాఖ వెళ్తారు. ప్రస్తుతం ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: