విశాఖ గ్యాస్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. ఘటన జరిగినప్పటి నుంచి కూడా ప్రధాని ప్రతీ నిమిషం కూడా అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం శాఖతో కూడా చర్చలు జరిపారు.

 

అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ తో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారితో చర్చలు జరిపారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు అలాగే ఆక్సీజన్ కొరత ఉందని తెలియగానే వేగంగా స్పందించిన ఆయన రక్షణ శాఖా ద్వారా అందించాలి అని సూచించారు. ఇప్పుడు మళ్ళీ వారితో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: