విశాఖ గ్యాస్ దుర్ఘటన పై సిఎం వైఎస్ జగన్ మాట్లాడారు. దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్... మృతి చెందిన కుటుంబాలకు రు. కోటి నష్ట పరిహారం ఇస్తామని జగన్ పేర్కొన్నారు. కంపెనీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తాము పరిహారం ఇస్తామని చెప్పారు జగన్. 

 

ఆస్పత్రుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. వైద్యం చేయించుకునే వారికి లక్ష ఇస్తామని చెప్పారు. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు పది లక్షలు ఇస్తామని చెప్పారు. 5 బాధిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 వేలు సహాయం చేస్తామని అన్నారు. చికిత్స చేయించుకున్న వారికి 25 వేలు ఇస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: