పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో మోడీ ప్రభుత్వం దూకుడు చర్యలను ప్రారంభించింది.ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతా లలో ఇకపై భారత వాతావరణ సూచనలను చేయనున్నట్లు తెలియజేసింది. అయితే ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలియజేసింది.
గతంలో గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్ లలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించాలని అనౌన్స్ చేసింది. అయితే భరత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కి ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించి నట్లు అయ్యింది. గతంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ ప్రాంతాలలో వాతావరం సూచనలను చేసేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆపివేసింది. పీవోకే భారత్లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం బలంగా సంకేతాలిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాము పీఓకే ప్రాంతాలలో వాతావరణ సూచనలను చేస్తున్నట్లు ఆర్ఎండీ హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ గురువారం (మే 7) తెలిపారు.