టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బీపీ డౌన్ కావడంతో శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు నిర్మాత సురేష్ కొండేటి. వాజీ రాజాకు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా స్టంట్ వేశారని సురేష్ కొండేటి క్లారిటీ ఇచ్చారు. శివాజీ రాజా త్వరగా కోలుకోవాలని తెలుగు సినీ ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. 

 

తగిన సమయంలో వైద్యులు సరైన చికిత్స అందించి.. హార్ట్‌లో స్టెంట్ వేశారట. ప్ర‌స్తుతం ఆయ‌న  కోలుకున్నార‌ని, తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కొడుకు విజయ్ రాజా తెలిపారు. శివాజీ రాజా గత కొన్ని రోజులుగా నిత్యావసరాలను విరాళంగా అందిస్తూ.. సినీ కార్మికుల కోసం తన వంతు కృషి చేస్తున్న విష‌యం తెలిసిందే.  అంతే కాదు ఆయన సొంత తోటలు పండించిన కూరగాయలు, పండ్లు సైతం పేద ప్రజలకు పంచి పెట్టారు.  గతంలో మా అసోసియేష్ లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పేద సినీ కార్మికుల కోసం కృషి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: