భారత్‌లో కరోనా విజృంభ‌న ఆగ‌డంలేదు. దేశంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదుకాగా, 103 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 16,539 మంది డిశ్చార్జి కాగా, 1,886 మృతిచెందినట్టుగా తెలిపింది. ప్రస్తుతం దేశంలో 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 


దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడులలోనే ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల దాదాపు 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు కాగా, 694 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్తాన్‌ 3,427, మధ్యప్రదేశ్‌ 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: