దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత మాజీ ఎమ్మెల్యే, పేర్ల శివారెడ్డి కన్ను మూశారు. గత  కొన్నాళ్ళు గా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 83 ఏళ్ళ శివారెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా పని చేసారు. కమలాపురం నుంచి 1978 లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. 

 

వైఎస్ కి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యే గా ఆయనకు పేరు ఉంది. స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఆయన మరణం తో ఆయన స్వగ్రామం ఎర్రగుంట్లలో ఒక్కసారిగా విషాద చాయలు అలముకున్నాయి. ఆయన ప్రొద్దుటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: