దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి జనాలకు పరేషాన్ ఎక్కువైంది. అయితే కరోనాని కట్టడి చేయడానికి భౌతిక దూరం, ముఖానికి తప్పని సరి మాస్క్ ధరించాలని ఆంక్షలు విధించారు. దాంతో ఇప్పు దేశంలో మనిషికి మనిషి దూరం పెరిగింది.  మనిషిని తాకాలంటే భయపడి పోతున్నారు.  కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు భారత్ లో లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నివారించాలంటే ప్రజలు గుమికూడకుండా, ఒకర్ని ఒకరు తాకకుండా 'సామాజిక దూరం' పాటించాలంటూ తొలినాళ్లలోనే హెచ్చరించారు. ఈ నేథ్యంలో ‘సామాజిక దూరం' అనేది వివక్షకు సంబంధించిన అంశంలా ఉందని, 'భౌతికదూరం' అనే పదం సరైనదని చాలామంది అభిప్రాయపడ్డారు.

 

కాగా, దేశవ్యాప్తంగా 'సామాజిక దూరం' అనే పదాన్ని ఉపయోగిస్తుండడంపై షకీల్ ఖురేషి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 'సోషల్ డిస్టెన్సింగ్' (సామాజిక దూరం) అనే పదం మైనారిటీ వర్గాల పట్ల వివక్షను సూచించేలా ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. 'భౌతికదూరం' అనే పదం వాడేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరాడు.  దాంతో ఈ పిటీషన్ పై  సుప్రీం ధర్మాసనం ఆ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మనుషులు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. పదాలపై విమర్శలు ఏంటీ అని ప్రశ్నించింది.  ఆ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా, కోర్టు సమయాన్ని వృథా చేశాడంటూ రూ.10 వేలు జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: