ప్రపంచంలో కరోనా ఎఫెక్ట్ ఎప్పటి నుంచి మొదలైందో కానీ అప్పటి నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  అమెరికా కంటే ముందు యూరప్ లో ఈ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా రోగుల్లో జ్వరం, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు సాధారణ లక్షణాలు కాగా, ఇప్పుడు కొత్తగా వాపు కనిపించడం వైద్య నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక అమెరికాలో అయితే కరాళ నృత్యం చేస్తుంది. ఇదిలా ఉంటే  ఇటీవల అమెరికాలో పదుల సంఖ్యలో చిన్నారులకు కరోనా సోకగా, వారిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. శరీరంలోని కొన్ని భాగాల్లో తీవ్రస్థాయిలో వాపు ఉందని గుర్తించారు. 

 

ఇటీవల న్యూయార్క్ లో కరోనా బారిన పడిన పిల్లల్లో కొందరికి గుండె భాగంలోనూ వాపు కనిపించిందని, దాంతో వారికి అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని నిపుణులు వివరించారు. అయితే ఇదే తరహా వాపు కవాసాకి వ్యాధిలోనూ కనిపిస్తుందని, అందుకే ఇది కరోనా కారణంగా వచ్చిందా, లేక కవాసాకి వ్యాధితో వచ్చిందా అనేది తేల్చాల్సి ఉందని అమెరికా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ఉన్నందున చిన్నారులు, వృద్దులకు కరోనా ఎఫెక్ట్ త్వరగా పడుతుందని అంటున్నారు.

 

ఇక మెరికాలో ప్రతి ఏటా 3 వేల మంది వరకు బాలలు ఈ వ్యాధి బారిన పడుతుంటారని అంచనా. కవాసాకి వ్యాధి ప్రధానంగా చిన్నారుల్లో కనిపిస్తుంది. దీని కారణంగా రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. కవాసాకి వ్యాధి కారక లక్షణాలైతే ఐదారు వారాల్లో నయం అవుతాయని, చాలామంది పిల్లలు పూర్తిగా కోలుకుంటారని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ జేన్ న్యూబర్గర్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: