ఇప్పుడు దేశ వ్యాప్తంగా వలస కూలీలు వేలాది మంది తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరలించాలి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం జరిగింది. అందరూ సొంత ఊర్లకు వెళ్లిపోతుంటే... 

 

బీహార్ నుంచి హమాలీలు తెలంగాణకు వస్తున్నారు. 225 మంది హమాలీలు బీహార్ లోని హజారియా నుంచి లింగంపల్లి స్టేషన్ కి దిగారు. వీరు వ్యవసాయ పనుల కోసం తెలంగాణాలో ఉండనున్నారు. వరికోతకు వీరు చాలా కీలకం. అందుకే బీహార్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: