విశాఖలో జరిగిన గ్యాస్ ప్రమాదాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ప్రభుత్వ౦పై పరోక్షలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడికి గ్యాస్ లీక్ విషయమై ఒక లేఖ కూడా రాసారు. 

 

విశాఖ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం గట్టి సెక్షన్లలో కేసులు నమోదు చెయ్యలేదు అని ఆరోపించారు చంద్రబాబు. ఈ ఘటనలో మానవ కోణం ఏమైనా ఉందా అనే దాని మీద విచారణ చెయ్యాలని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: