విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఎదుట గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కంపెనీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యాజమాన్యానికి వ్యతిరేకంగా అక్కడ నిరసన జరుగుతుంది. వ్యతిరేకంగా నినాదాలు జరుగుతున్నాయి. కంపెనీ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

గ్యాస్ లీకేజ్ ఘటనలో మరణించిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి అయింది. వారి మృత దేహాలను అక్కడికి తీసుకొచ్చి నిరసన చేస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: