విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వ వైఖరికి కంపెనీ వైఖరికి నిరసనగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటన లో మృతి చెందిన బాధితుల మృతదేహాల తో ప్రజలు నిరసన చేస్తున్నారు. 

 

అక్కడికి వెళ్ళిన మంత్రి అవంతి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వాహనాన్ని గ్రామస్తులు నిర్భందించారు. కంపెనీ ని తరలించాలి లేదా రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: