గత నెల రోజులుగా తన నియోజకవర్గంలో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణి చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె నిత్యావసర సరుకులను టేకుపల్లి మండలంలో పంపిణి చేస్తున్నారు. అయితే అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. 

 

దీనితో ఆమె ప్రాణాలకు ముప్పు అని భావించిన పోలీసులు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆమెను కోరారు. ఇదే సందర్భంలో ఆమెను చూడటానికి గానూ పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. దీనితో పోలీసులు కాస్త కంగారు పడాల్సి వచ్చింది. పోలీసుల విజ్ఞప్తితో సీతక్క వెనక్కు వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: