తెలుగు ఇండస్ట్రీలో కెరటం చిత్రంతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసి రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో మంచి విజయం అందుకుంది.  అయితే ఈ అమ్మడు మంచిఫిట్ నెస్ బాడీ మెయింటేన్ చేయడంతో స్టార్ హీరోల సరసన బాగా సెట్ అయ్యింది.  దాంతో ఒకదశలో టాలీవుడ్ కుర్ర హీరోలు అప్పట్లో హీరోయిన్ ప్రస్తావన వస్తూ ఈ అమ్మడి పేరు సూచించేవారట.  తెలుగు, తమిళంలో మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ పయనం అయ్యింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు దక్షిణాది వైపు మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది.  ఆ మద్య నాగార్జున సరసన ‘మన్మథుడు2’ చిత్రంలో నటించింది.

 

 

కమల్ సరసన 'భారతీయుడు2'లో అవకాశం దక్కించుకున్నప్పటికీ... లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.  ఇదిలా ఉంటే త్వరలోనే రకుల్ పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తలపై రకుల్ తల్లి స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని చిత్రాలతో రకుల్ బిజీగా ఉందని చెప్పారు. ఇప్పట్లో ఆమె పెళ్లి ఆలోచన లేదని తెలిపారు. రకుల్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనితో వివాహం జరిపిస్తామని చెప్పారు.  ప్రస్తుతం అమ్మాయిలు స్వతంద్ర భావాలు కలిగి ఉన్నారని.. వారి లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో వాళ్లే చూసుకుంటున్నారని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: