కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఇప్పుడు విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిక్షలు ఎప్పుడు అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దేశ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్న నేపధ్యంలో విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా ఇప్పుడు ఆందోళన లో ఉన్నారు.

 

అయితే సిబీఎస్ఈ 12 క్లాస్ విద్యార్ధుల పరిక్షలు వాయిదా పడ్డాయి. దీనితో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు పై స్పష్టత రావడం లేదని పలువురు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా ఇప్పుడు పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: