మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు సామాన్యులు అమ్మలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలను చెప్తున్నారు. తల్లి చేసిన సేవలను స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలి అని సూచనలు చేస్తున్నారు. 

 

సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ వంతు ధన్యవాదాలు, శుభాకాంక్షలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా తల్లులు చేస్తున్న కృషిని వివరించారు. విశాఖ గ్యాస్ ప్రమాదం తల్లులకు తీరని గర్భ శోకం విధించింది అని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కృషి ని వారికి అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: