ఈ ఫొటో చూస్తుంటే ఇందులో ఉన్న ధోనీనేనా అన్న అనుమానం కలగక మానదు. ప్రస్తుతం బీసీసీఐ కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతోన్న లాక్ డౌన్ వల్ల ఐపీఎల్ 2020ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి సీజన్ కూడా ముగియడంతో ఇప్పట్లో ఐపీఎల్ ఉంటుందా ? అన్నది అనుమానమే. ఐపీఎల్ వాయిదా పడడంతో నిన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా శిబిరంలో ఉన్న ధోనీ ఇప్పుడు ఆ శిక్షణ ముగించుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు.
కరోనా వైరస్ అనేది అన్ని కార్యక్రమాలను నిలిపి వేసింది. ఇక క్రికెటర్లు సైతం తమ శిక్షణలో సామాజిక దూరం పాటిస్తూనే ప్రాక్టీస్ చేశారట. ఇక ఇప్పట్లో ఐపీఎల్ లేదన్నది దాదాపు స్పష్టం కావడంతో ధోనీ రాంచీలోని తన ఇంట్లో కుమార్తె జీవాతో పాటు తన భార్య సాక్షితో గడుపుతున్నాడు. అయితే ఈ ఫొటోల్లో ధోనీ పూర్తిగా తెల్లబడిపోయిన గెడ్డంతో దర్శన మిస్తున్నాడు. అకస్మాత్తుగా చూస్తే ఈ ఫోటోలో ఉన్నది ధోనీయేనా ? అన్న సందేహం కలగక మానదు.