ప్రపంచంలో కరోనా మరణాలు మొదలైన్పటి నుంచి అత్యధికంగా అమెరికాలో సంబవిస్తున్నాయి. గత 24 గంటల్లో 1,568 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. వైరస్ మొదలైన నాటి నుంచి ఇంతమంది ఒకే రోజు మరణించడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అయితే అనుమానిత మరణాలను కూడా కరోనా మృతుల కింద పరిగణించడంతో ఒకేసారి భారీగా మరణాల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. 13,09,164 కరోనా కేసులు నమోదయ్యాయి.
వీటిలో దాదాపు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, 26,771 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది ఇక్కడే. అమెరికాలో అత్యధికంగా సుమారు 7 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 37వేల మంది ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో లక్ష 88వేల మందికి కరోనా సోకగా మరణాల సంఖ్య 20వేలకు చేరువలో ఉంది. ఇటలీలో లక్ష 72వేల మందికి పైగా కరోనా పాజిటివ్తో ఇబ్బంది పడుతున్నారు.