ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. గత 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు అయ్యాయి నిన్న 43 కేసులు నమోదు కాగా తగ్గింది అనుకున్న కరోనా మళ్ళీ పెరిగింది. ఇప్పటి వరకు ఏపీ లో 45 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

 

దీనితో కరోనా కేసుల సంఖ్య 1980 కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 1010 ఉండగా 925 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో వేగంగా పెరుగుతున్నాయి కరోనా కేసులు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 కేసులు కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: