ఒక పక్క చైనాలో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గకపోయినా సరే చైనా బుద్ధి మాత్రం మారడం లేదు. సరిహద్దుల్లో భారత సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. ఏదోక రూపంలో భారత అర్మీని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న చైనా సైనికులు... ఇప్పుడు ఉత్తర సిక్కిం ప్రాంతంలో చొచ్చుకుని వచ్చారు. 

 

ఉత్తర సిక్కిం ప్రాంతంలో భారీగా చైనా కార్మికులు మన దేశంలోకి చోచ్చుకొచ్చారు. దీనితో అప్రమత్తమైన భారత ఆర్మీ వారిని ప్రతిఘటిస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు భౌతిక దాడులు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. కేంద్ర హోం శాఖ రక్షణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అంటున్నారు. దీనిపై ఇంకా రక్షణ శాఖ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: