టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పలు విజయవంతమైన సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సిద్దార్థ హీరో గా వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా...
ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం, మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు, మనసంతా నువ్వే సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ కావడమే కాకుండా ఆయన అగ్ర నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సినిమాలు అన్నీ కూడా టాలీవుడ్ చరిత్రలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్ ని మార్చేసింది.
Team #SumanthArtProductions Wishes Succesful Producer/Director @MSRajuOfficial who delivered successful hits like #NuvvostananteNenoddantana #Varsham #Okkadu #ManasanthaNuvve a Happy Birthday 💐#HBDMSRaju pic.twitter.com/zgZrl5ynu2
— eluru Sreenu (@IamEluruSreenu) May 10, 2020